పురపోరుకు సర్వం సిధ్ధం?
-స్థానిక ఎన్నికల కు శరవేగంగా ఏర్పాట్లు.
-వార్డు వారీగా ఓటర్ల జాబితా విడుదల
-పోలింగ్ కేంద్రా ల గుర్తింపునకు చర్యలు
-1,200 ఓటర్లకు ఒక బ్యాలెట్ బాక్స్
-ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం
విశాఖపట్నం , వాయిస్ టుడే :
స్థానిక సంస్థ ఎన్నికల్లో ముందుగా మున్సిపల్ ఎన్నికను నిర్వహించాని ప్రభుత్వం భావిస్తున్నట్లు తొస్తోంది. పంచాయతీ, మండ పరిషత్ ఎన్నిక నిర్వహణకు సాంకేతికపరమైన ఇబ్బందు తలెత్తడంతో ఈలోపు జివిఎంసి ఎన్నికను పూర్తిచేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.. తాజాగా వార్డు వారీగా ఓటర్ల జాబితా విడుదలైన సంగతి మనకు తెలిసిందే.దీంతో మున్సిపల్ ఎన్నికకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయా అనే సందేహం పుచోట్ల వ్యక్తమవుతోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రా గుర్తింపు దాదాపుగా పూర్తి చేసిన అధికాయి.. తాజాగా సోమవారం విశాఖ నగరపాక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఈసారి బ్యాలెట్ పద్ధతిలో మున్సిపల్ ఎన్నికు నిర్వహించాని ఎన్నిక సంఘం భావిస్తోంది. మరోవైపు ఎన్నిక కమిషన్ ఏ క్షణాన నోటిఫికేషన్ విడుద చేసినా.. తాము ఎన్నిక నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నెలాఖరులోపు ఎన్నిక నోటిఫికేషన్ రావచ్చని అధికారులూ భావిస్తున్నారు.
ఓటర్ల జాబితా తయారు:
రాష్ట్ర ఎన్నిక సంఘం ఆదేశా మేరకు అధికాయి ఇప్పటికే కులావారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. తాజాగా సోమవారం మొత్తం ఓటర్ల వివరాతో వార్డు వారీగా ఓటరు జాబితాను ప్రకటించారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. ఇటీవల కమిషనర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నిక ల నోటిఫికేషన్ రావచ్చని పేర్కొన్నారు. అందుకే నగర పాల క సంస్థతో పాటు మిగతా మున్సిపాలిటీల కు ఎన్నికలు జరిపేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లలో మునిగిపోయారు.
మళ్ళీ పాత పధ్దతిలోనే ఎన్నిక ల నిర్వహణ
ఈసారి ఎక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం) ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిన మున్సిపల్ ఎన్నికు నిర్వహించేందుకు సిద్ధం కావాని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాు జారీ చేసింది. దీంతో 1,200 మంది ఓటర్లకు ఒక బ్యాలెట్ బాక్స్ చొప్పున అధికాయి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.గతంలో ఈవిఎం మొరాయింపు, అనేక అవతవకంటూ పు విమర్శు ఎదుర్కొన్న కారణంగా ఎన్నికల కమిషన్ మళ్ళీ పాతపధ్ధతిలోనే ఎన్నిక ఏర్పాట్లను చేసస్తున్నట్లు సమాచారం.వార్డు పునర్విభజన మాదిరి ఎన్నిక విషయంలో కూడా కమిషన్ తన హడావుడి తీరును ప్రదర్శించనుందనే వాదన చాలా గట్టిగానే వినవస్తోంది.రెండు మూడు రోజు వ్యవధిలోనే తేదీను ఖరారు చేసి, అభ్యంతరాల స్వీకరణ లాంఛనప్రాయం చేయనుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేకపోయినప్పటికి రాజధాని రగడ వేడిలోనే వైసీపి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాన్ని రచిస్తున్నట్లు తొస్తోంది.
.రిజర్వేషన్ ఖరారు ఇలా..
నగరపాలక సంస్థలోని అన్ని డివిజన్ల తో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న వార్డు రిజర్వేషన్ను కలెక్టర్ నేత ృత్వంలోనే నిర్ణయిస్తారు. నగరపాల క సంస్థ మేయర్ పదవితో పాటు అన్ని మున్సిపల్ చైర్మన్ స్థానా రిజర్వేషన్లు మాత్రం రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, కమిషనర్ు ఖరారు చేస్తారు.